నవతెలంగాణ – అశ్వారావుపేట : భానూదయ సాహిత్య సంస్థ,అశ్వారావుపేట ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాల కవుల నుండి సేకరించిన కవితలతో వెలువడిన మయూఖం కవితా సంకలనం ను ఆదివారం జిల్లా కేంద్ర గ్రంధాలయం కొత్తగూడెంలో జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు దిండిగాల రాజేందర్,జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాసరావులు ఆవిష్కరించనున్నట్లు భానూదయ సంస్థ అధ్యక్షులు సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు శనివారం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని “మయూఖం” లోని కవులందరూ సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.కవులందరికి అతిధుల చేతులమీదుగా పుస్తకం అందించ బడుతుంది అని అన్నారు. ఈ కవితా సంకలనానికి సంపాదకులుగా సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు సహ సంపాదకులుగా జయ వాసు లు వ్యవహరించారు.భద్రాద్రి జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా కవులు చే రచించబడిన తొలి కవితా సంకలనంగా మయూఖం నిలవనున్నది.