నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆఫ్రిదీ చెల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఐతే.. తన చెల్లిని చూసేందుకు వెళ్తున్నాననీ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని రాత్రి షాహిద్ ఆఫ్రిదీ ట్వీట్ చేశాడు. కానీ విధి రాత మరోలా ఉంది.n విషాద వార్త తెలియగానే షాహిద్ సహా అతను కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇలా అవుతుందని అతను ఊహించలేదు. తిరిగి ఆమె కోలుకుంటుందని ఆశించాడు. ఐతే.. ఈ వార్త తెలియగానే అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు. అతని చెల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ధైర్యంగా ఉండాలని అఫ్రిదీని కోరుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ జరుగుతోంది. పాకిస్థాన్ జట్టు ఆటతీరు అంత గొప్పగా లేదు. ఇటీవల ఇండియాతో జరిగిన మ్యా్చ్లోనూ చతికిలపడింది. ఈ విషయమై ఆవేదనతో ఉన్న ఆఫ్రిదీని.. చెల్లి మరణం మరింత కుంగదీస్తోంది.