![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/IMG-20231002-WA0029-300x226.jpg)
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిల సందర్భంగా పీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్బిన్ హంధాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కాంగ్రెస్ భవన్ నందు వారి చిత్రపటానికి, అదే విధంగా గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు సోమవారం అర్పించడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి సత్యా మార్గాన్ని ఎంచుకొని భారత దేశ స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి గాంధీ గరని, స్వాతంత్రం వచ్చిన తరువాత దేశాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేసిన వ్యక్తి అని, యువకులందరూ గాంధీ మార్గం ఆచరించి ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.అదేవిధంగా పిసిసి ఉపాధ్యక్షులు తహెర్ బిన్ హమ్దన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో స్వేచ్ఛ మార్గాన్ని ఎంచుకొని బ్రిటిష్ వారిని తన సంకల్ప బలంతో పారద్రోలిన వ్యక్తి మహాత్మా గాంధీ అని ,అదే విధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య ఫలాలు అనుభవించాలనదే మాహాత్మ గాంధీ కోరిక అని కావున రాబోయే రోజుల్లో మహాత్మా గాంధీ కళలను సహకారం చేసే విధంగా ప్రజలు ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ ప్రజలకు యువతకు సత్యమార్గాన్ని చూపించారని, సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలమని నమ్మకాన్ని అందించారని, స్వాతంత్ర పోరాటంలో గాని స్వాతంత్రం వచ్చిన తరువాత దేశ అభివృద్ధిలో గాని మహాత్మా గాంధీ సేవలు ఎన్నటికీ మరువలేవని, కానీ ఇప్పుడు కొన్ని మతతత్వ శక్తులు గాంధీ ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాయని కానీ ఆకాశం పై ఉమ్మి వేస్తే అది వారి మీద పడుతుందని గుర్తుంచుకోవాలని , గాంధీ సేవలు ఎన్నటికీ మరువలేని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి,రూరల్ ఇంఛార్జి భూపతి రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ అరికేల నర్సారెడ్డి,జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి విపుల్, ఈసా, అబ్దుల్ ఏజాజ్, మహిళా కాంగ్రెస్ నాయకులు పొల ఉష, ఆశాబీ, రేవతి, మలైకా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి,కొర్వ రాజేందర్,ప్రమోద్,కైసర్, అవీన్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.