నవతెలంగాణ – హైదరాబాద్: టీఎస్ ఈసెట్ -2023 ఫలితాలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ కలిసి విడుదల చేయనున్నారు. ఫలితాలను మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ వెల్లడించారు. టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్షను మే 20వ తేదీన రెండు సెషన్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే.