నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని రుశేగావ్ గ్రామానికి గురువారం మహారాష్ట్రలోని దేగ్లుర్ కు చెందిన పవన్, శ్యామ్, ఇద్దరూ టు వీలర్ పై వచ్చి అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణంలో 161వ జాతీయ రహదారి గుండా వెళుతుండగా అదుపుతప్పి డివైడర్ కు ఢీ కొట్టింది ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా పవన్ అనే వ్యక్తి మార్గమధ్యంలోని చనిపోయినట్లు ఎస్సై కృష్ణారెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు. శ్యామ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు ఉన్నట్లు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.