– సమస్యలు పరిష్కారం చేయకుండా బయట వ్యక్తులు రావొద్దని నోటిసులు ఇవ్వడం సరికాదు..
– తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో కూడా ఇలాంటి నిర్ణయాలు చేయలే..
– ఎక్కడ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రశ్నించోద్దని నిర్బంధం
– తక్షణమే నోటీసులు వెనక్కి తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం.
– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో,కెజీబివిలో,మోడల్ స్కూల్స్ లోకి డిఇఓ అనుమతి లేకుండా లోపలికి రావడానికి అనుమతి లేదని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన గారు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ.రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది.
– రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటీకీ యూనిఫామ్ ఇవ్వలేదు, ఆశ్రమ పాఠశాలలో, కెజిబివిలు పాఠ్యపుస్తకాలు రాలేదు. మధ్యాహ్నం భోజనం నిధులు లేవు, టీచర్ పోస్టులు భర్తీ లేదు, ఇన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేయకుండా సమస్యలు గురించి తెలుసు కోని పోరాడేవారిని రావోద్దని ఆంక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు.
-సాక్షతూ సిఎం మనుమడే గచ్చిబౌలి బాలికల పాఠశాల గురించి వివరించి టాయిలెట్స్ లేకపోవడంతో కోన్ని నిధులు పెట్టి మరమ్మతులు చేశారు. ఆలాంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. కెజిబివిలను కళాశాలకు ఆఫ్ గ్రేడ్ చేసి కనీసం భవనాలు లేకుండా పాఠశాలలోనే తరగతులు, డార్మెటరి నిర్వహిస్తున్న ఈ దేవసేవ గారు ఎక్కడ పర్యటించలేదు. కనీసం పట్టించుకున్న సందర్భం లేదు.
– మోడల్ పాఠశాలలో కనీసం టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో మోడల్ పాఠశాలలో ఉండాల్సిన టీచర్లు సంఖ్య కంటే చాలా తక్కువగా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయరు. కానీ నిర్బందాలు పెట్టి పోరాడే వారిని మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
– 24 వేల టీచర్స్ పోస్టులు భర్తీ లేదు, 30 లక్షల మందికి మధ్యాహ్న భోజనం నిధులు పెంచలేదు, కెజిబివిలలో సరైన సదుపాయాలు కల్పన ఉండదు, టాయిలెట్స్, బాత్ రూమ్స్ నిర్మాణం ఉండదు. “మన ఊరు-మన బస్తీ-మన బడి” పేరుతో వచ్చిన నిధులు గుత్తేదారులు యధేచ్చగా బిల్లులు పెట్టి దోచుకుంటుటే చోద్యం చూశారు తప్ప కనీసం విచారణ లేదు. విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన గారు తక్షణమే మన ఊరు, మనబస్తీ, మన బడి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలి.
– ఈ మద్యనే విడుదల అయినా పిజీఐ రిపోర్ట్ నివేదికలే చెబుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి ఎలా ఉందో తెలుస్తుంది.
– తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇలానే నోటిసులు ఇచ్చి, సర్య్కూలర్స్ జారీ చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించేవారమా మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాస్వామిక చర్యలు ఎందుకు అని తక్షణమే ఈ చర్యలు విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాము.