![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/IMG-20231028-WA0686-1-300x225.jpg)
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా తుర్కపల్లి మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొనికెన వెంకటేష్ యాదవ్ ను శనివారం నియమించారు.నియామక పత్రాన్ని పిసిసి మెంబర్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ… తన నియామకానికి సహకరించిన జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పని చేస్తానని అన్నారు .ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ నాయక్, తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు కానుగంటి శ్రీనివాస్, మోహన్ బాబు నాయక్, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.