వాగులో చిక్కుకున్న వారిని కాపాడిన గ్రామస్తులు

నవతెలంగాణ-దారుర్‌
మండల పరిధిలోని మైలారం గ్రామంలో ప్రమాదవశాత్తు మొండికుంటచెరువు అలుగు వరదల్లో చిక్కుకున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ లోక్యా నాయక్‌, తండ్రితార్యా నాయక్‌ను మైలారం సర్పంచ్‌ కుమారుడు దేవేందర్‌ నాయక్‌ గ్రామస్తుల సాయంతో కాపాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దన్నారు. వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు.