నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్య, పక్షవాతంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఒక ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని చెప్పారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో కొంత కాలంగా రాజకీయాలు ఆయన దూరంగా ఉన్నారు.