నవతెలంగాణ – చిన్నకోడూరు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్నకోడూరు మండల విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ల సమ్మె నోటీసు ఏపిఎం మహిపాల్ కి బుధవారం అందజేశారు. చిన్నకోడూరు మండలంలోని అన్ని గ్రామ సంఘాల వివొఎల మండల సమాఖ్య సమావేశం ఏర్పాటు చేసుకుని 8 డిమాండ్ లతో కూడిన సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, జిల్లా నాయకులు తలపాక కిష్టయ్య, చిన్నకోడూరు మండలం రాజు, లక్ష్మి, నర్సవ్వ, లక్ష్మణ్, చంద్రం, మహేష్, మమత, లత తదితరులు పాల్గొన్నారు.