– మైనార్టీలు ఏకగ్రీవ తీర్మానాలు
నవతెలంగాణ- భీంగల్
భీంగల్ పట్టణ కేంద్రంలోని 1300 మైనార్టీ కుటుంబాలు మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతు గా ఉంటామని కమిటీ అధ్యక్షుడు అంజుమ్ ఆధ్వర్యంలో తీర్మానం చేసి బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు దొనకంటి నరసయ్య, మల్లెల లక్ష్మణ్ కన్నె సురేందర్ లకు అందజేశారు. అలాగే బడా భీంగల్ 30 కుటుంబాలు, సికింద్రాపూర్ 50 కుటుంబాలు, గోను గోపుల 35 కుటుంబాలు, బాబాపూర్ 500 కుటుంబాలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అండగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేసి అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ హయాంలో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరిగిందని దీంట్లో భాగంగానే బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఏ నాయకుడు చేయని అభివృద్ధి మంత్రి చేసి చూపించాడని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మోయిస్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.