నవతెలంగాణ- కంఠేశ్వర్
సీసీ కెమెరాలో నిఘాలో అన్ని గణేష్ మండపాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు గణేష్ నిమజ్జనానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాము అని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సత్యనారాయణ వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ మండపాల పై పోలీసుల నిఘా వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఐ.పి.యస్., తెలియజేశారు. గత నాలుగు రోజుల క్రితం ప్రారంభమయిన గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తూకార్యచరణ ప్రణాళికతో పోలీస్ కమీషనరేటు పరిధిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు పోలీస్ భద్రత కల్పించడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ సత్యనారాయణ కమీషనర్ తెలియజేశారు. నిజామాబాద్ కమీషనరేటు పరిధిలో మొత్తం 5405 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 2502 విగ్రహాలు, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 1955 విగ్రహాలు, బోధన్ డివిజన్ పరిధిలో 948 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలకు భద్రత కల్పించడం కోసం వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా గణేష్ మండపాల రిజిస్ట్రేషన్, ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే దిశగా విగ్రహాల ఏర్పాటుకు అవసరమయిన పోలీస్ అనుమతులకై గణేష్ నవరాత్రి నిర్వహాకులు సంబంధిత పోలీస్ స్టేషన్ వెళ్లకుండా తోలిసారిగా ఆన్లైన్ విధానం ద్వారా ధరఖాస్తు చేసుకున్న గణేష్ నవరాత్రి నిర్వహాకుల కు విగ్రహా ఏర్పాటుకు స్థానిక పోలీసులు అనుమతులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
24 గంటలు బ్లూకోర్ట్స్ సిబ్బంది పర్యవేక్షణ ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు కల్పిస్తున్న భద్రతలో భాగంగా సేక్టార్ వారిగా విధులు నిర్వహించే బ్లూకోర్ట్స్ మరియు పెట్రోకార్ సిబ్బంది ప్రతి రోజు షిఫ్ట్ ల వారిగా మూడు పర్యాయాలు మండపాలను సందర్శించి అక్కడి స్థితిగతులపై అధ్యయనం చేస్తూ భద్రత విషయంలో నిర్వాహాకులకు సూచనలు చేస్తూ, మండపాల వారిగా జారీచేసిన పాయింట్ బుక్ లో, సేక్టార్ పోలీస్ సిబ్బంది సంతకం చేయడం జరుగుతుంది.నిమజ్జనానికి సి.సి కెమెరాల ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలలో సి.సి కెమెరాల ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ లో ప్రధానంగా గణేష్ నిమజ్జనం రూట్లో దాదాపు 100 సి.సి కెమెరాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కెమెరాలు ఐ.పి టెక్నాలజీ తో రూపోందించడం జరిగింది. ఈ కెమెరాలు పూర్తిగా పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరిగింది. ఈ సి.సి టివిలు 24×7 ప్రకారంగా పూర్తిగా సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుంది.
ప్రజలకు విజ్ఞాప్తి…
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో తేది: 28-9-2023 నాడు మిలాద్ ఉన్ నబీ పండుగ, గణేష్ నిమజ్జనం నిర్వహించడం జరుగుతుంది. రెండు కూడా ఒకే రోజు ఉన్నందున, వీటి నిమిత్తం శాంతికమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ శాంతి కమిటీ సమావేశంలో ఎక్కడ, ఎలాంటి అల్లర్లు జరుగకుండా, ఎవ్వరి మనోభావాలకు దెబ్బతీయ కుండా ఉండాలని తెలియజేయడం జరిగింది. మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 లోపు నిర్వహించాలని, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలను మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభించాలని, కావున ప్రతీ ఒక్కరు శాంతి కమిటీ సభ్యులు తెలిపిన విధంగా కార్యక్రమాలను నిర్వహి ంచాలని , అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో సి.సి కెమెరాలు ఏర్పాటుచేయడం జరిగిందని, అట్టి సి.సి. కెమెరాల ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది వీక్షించడం జరుగుతుందని, మరియు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ప్రత్యేకంగా సిబ్బంది వీక్షించడం జరుగుతుందని, పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని, ఎవ్వరయిన ఎలాంటి చిన్న అల్లర్లు చేయడానికి ప్రయత్నించిన, ప్రోత్సాహిం చిన వారిపై అక్కడికక్కడే చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ క్లుప్తంగా వివరించారు.