– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మహేశ్వరం
గొల్ల, కురుమలను అన్ని రంగాల్లో ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం గొల్ల కురుమ సంఘం నాయకులు స్థలం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గొల్ల కురుమలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చి గొల్ల కురుమలకు తగు న్యాయం చేస్తున్నారని చెప్పారు. అర్హులైన గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసి వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నామని అన్నారు. నియోజకవర్గంలోని గొల్ల కురుమల సమస్యలను దశల వారిగా పరిష్కరి స్తున్నామన్నారు. గొల్ల కురుమలు ఆర్ధికంగా నిలదొక్కు కొని వ్యాపార రంగంలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, అంబయ్య యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆనందం, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, పీఏసీఎస్ డైరెక్టర్లు పాల్కం బాలయ్య, కడమోని ప్రబాకర్ మహేశ్వరం గ్రామ శాఖ అద్యక్షుడు దుడ్డు క్రిష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.