– పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో నాగరాజ్
నవతెలంగాణ-చిన్నకోడూరు
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో తెలిపిన 6 గ్యారంటీ పథకాల ప్రచారాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని డిసిసి ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ పార్టీ నాయకులను కోరారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. అల్లీపూర్ గ్రామా అంబెడ్కర్ సంఘం నాయకులు, బీజేపి నాయకులను కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూజల హరికష్ణ భారీ మెజారిటితో గెలిచే విధంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మీసం మహేందర్, పర్శరాం, ఉడుత జయంత్, బత్తిని గణేష్, బర్ల స్వామి, తుమ్మల శ్రీను, మంకాళి మల్లేష్, జెల్ల అజరు, బాపురెడ్డి, విజయకుమార్ రెడ్డి, పార్టీలో చేరిన వారు మంకాళి యాదగిరి, కామ మహేష్ బాబు, లింగంపల్లి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.