ప్రజల సంక్షేమ కోసం కృషి చేస్తా : యెన్నం

మహబూబ్‌ నగర్‌: ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బుధ వారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని తిమ్మసాని పల్లి, కోయా నగర్‌ వార్డు లలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. పెద్ద ఎత్తున మహిళలు యువత యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు మంగళహారతులతో వచ్చి తిలకం దిద్ది ఊరేగింపుగా వేదిక వరకు బాజా భజంత్రీలతో బాణాసంచా కాల్చారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మహిళలకు, యువతకు ధన్యవాదాలు తెలిపారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ నేడు కష్టాలను, బాధలను ఇచ్చిందన్నారు. గూడు ఇస్తారని ఆశ పడ్డ అమ్మల, అక్కల ఆశలు అడియాసలైనాయని ఆరోపించారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసులు కొట్టి వేయకుండా, అలాగే పెట్టి యువతను ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రాకుండా చేసి, ఆయా కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నారన్నారు. సోనియా గాంధీ ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు తెలిసిన నాయకురాలని, ప్రధానంగా తెలంగాణ యువత భవిష్యత్తు కోసం, ప్రజల కోసం మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి ఆరు గ్యారెంటీ పథకాలను పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆ పథకాలు అమలు చేస్తామని, ప్రతి ఇంటికి అంది స్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ ఒబేదుల్లా కొత్వాల్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సిరాజ్‌ ఖాద్రీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్‌ పి వెంకటేష్‌, ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఆనంద్‌ గౌడ్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మాజీ మహిళ అధ్యక్షురాలు శ్రీమతి బెక్కరి అనిత, జిల్లా ఎస్సి సెల్‌ అధ్యక్షుడు సాయిబాబా, జిల్లా ఎస్టీ సెల్‌ చైర్మన్‌ లింగం నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అమర్‌, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ యాదవ్‌, పట్టణ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జి. శ్రీనివాస్‌ గౌడ్‌, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు ఆజ్మత్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బెక్కరి మధుసూదన్‌ రెడ్డి, అశ్వక్‌ , రాఘవ , అశోక్‌ , కిషన్‌, కష్ణకుమార్‌%×% మైనారిటీ యూత్‌ అధ్యక్షుడు అవేజ్‌, జహీర్‌ తదితరులు పాల్గొన్నారు.