– కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్
– బుట్ట దాఖలైన శ్రీ కష్ణ కమిటీ సిఫారుసులు
– దొడ్డిదారిలో అధికారంలోకి రావడానికి కుట్రలు
నవతెలంగాణ-ఆమనగల్
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావించడంలో ఆంతర్యం ఏమిటని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ ప్రశ్నించారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికలు జరుగాల్సిన కీలక సమయంలో ప్రాంతీయ పార్టీలను నష్టపర్చాలనే దురుద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికలను ముందుకు తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ నియమాలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించాల్సి వస్తుందన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి వేరు వేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికలు అంటే యాభై శాతానికి పైగా రాష్ట్రాలు ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇవేవి లేకుండా ప్రజాస్వామ్యానికి విలువలు ఇవ్వకుండా దొడ్డి దారిలో అధికారంలోకి రావడానికి కుట్రలు కుతంత్రాలతో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం ఇది సాధ్యమయ్యే పని కాదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి పార్లమెంట్ స్థానంలో రెండు అసెంబ్లీ స్థానాలు పెంచాలని నాలుగు సంవత్సరాల క్రితం శ్రీ కష్ణ కమిటీ చేసిన సిఫార్సులు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆఘమేఘాల మీద చట్టాలను అధిగమించి బడ్జెట్తో సహా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అస్థిత్వం కోల్పోయే విధంగా ఆర్థిక వేధింపులకు గురి చేస్తూ రాష్ట్ర అభివద్ధికి ఎందుకు సహకరించడం లేదు అన్నారు. విభజించు పాలించు అని కాకుండా దేశంలోని 140 కోట్ల ప్రజలను వసుధైక కుటుంబంలా చూస్తూ ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కడ్తాల్ మండలంలోని రేఖ్యా తాండాకు చెందిన భీమ్లా నాయక్ నూతన గహప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , నాయకులు, తదితరులు పాల్గొన్నారు.