– 2018లో కాంగ్రెస్ ఖాతాలో14 స్థానాలు..
మళ్లీ బీజేపీకి సవాలు విసురుతుందా?
రారుపూర్ : సుర్గుజా ఛత్తీస్గఢ్లోని ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఈ బ్లాక్లో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో ఇక్కడ కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకుంది. ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోవడం వల్ల ఆ పార్టీ భారీ మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 15 ఏండ్ల తర్వాత ఛత్తీస్గఢ్లో 90 స్థానాలకు గాను 68 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి బీజేపీని అధికారం నుంచి దింపింది. మళ్లీ ఇదే సుర్గుజా ప్రాంతంలో కాంగ్రెస్ 2018 లాంటి సీన్ రిపీట్ అవుతుందా..! ప్రస్తుతం పార్టీలో అధికార వ్యతిరేకతతోపాటు అంతర్గత విభేదాల మధ్య సాధ్యమా.. అనే ప్రశ్న ఉదయిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్దేయో ఇద్దరూ ఈ సర్గుజా ప్రాంతం నుంచి వచ్చారు. ఇది కాంగ్రెస్కు బలమైన అంశంగా మారడంతో పాటు బలహీనంగా కూడా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి ఈ ఇద్దరు పెద్ద నేతల మధ్య అంతర్గత పోరు వల్ల ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లుతుందనే చర్చ నడుస్తోంది. సుర్గుజాలో మొత్తం 6 జిల్లాలు ఉన్నాయి. ఇందులో జష్పూర్, కొరియా, సూరజ్పూర్, సుర్గుజా, బలరాంపూర్, కొత్తగా ఏర్పడిన మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్ (ఎంసీబీ) ఉన్నాయి. వీటిలో, జష్పూర్ జిల్లాలోని కుంకూరి, పాతల్గావ్ , జష్పూర్బీ సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్, లుండ్రా ,సీతాపూర్బీ బలరాంపూర్ జిల్లాలోని ప్రతాపూర్, రామానుగంజ్ ,సమ్రి ఉన్నాయి. సూరజ్పూర్ జిల్లాలో ప్రేమ్నగర్ , భట్గావ్బీ కొరియా జిల్లాలోని బైకుంత్పూర్ ఎంసీబీ జిల్లాలో మనేంద్రగర్ , భరత్పూర్-సోహ్నత్తో సహా మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 17న రెండో దశ ఎన్నికల్లో ఈ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈ 14 సీట్లలో 9 షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. సుర్గుజా ప్రాంతం ఛత్తీస్గఢ్ ఉత్తర భాగంలో ఉంది. దట్టమైన అడవులు, ముఖ్యమైన ఖనిజ వనరుల ఉనికికి ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పరిగణించబడేది, కానీ ఆ తరువాత ఇక్కడ శాంతిని నెలకొల్పడంలో విజయం సాధించింది. ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ , జార్ఖండ్ సరిహద్దులుగా ఉంది. 2008 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ 9, కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకున్నాయి. అదే సమయంలో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 7 సీట్లు గెలుచుకున్నాయి. అయితే 2018 ఎన్నికల్లో సుర్గుజాలోని అన్ని స్థానాల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. భూపేష్ బఘెల్ నేతత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు – టిఎస్ సింగ్దేవ్, అమర్జీత్ భగత్ , ప్రేమ్సాయి సింగ్ టేకం – సుర్గుజా ప్రాంతం నుంచి వచ్చారు. ఈ ఏడాది జులైలో టేకం మంత్రివర్గానికి రాజీనామా చేశారు. ”కాంగ్రెస్ కచ్చితంగా చాలా స్థానాల్లో ఆధిక్యం సాధిస్తుంది. కాంగ్రెస్కు 10-11 సీట్ల కంటే తక్కువ రావని నేను భావిస్తున్నాను” అని టిఎస్ సింగ్దేవ్ ఓ సంభాషణలో తెలిపారు. అయితే ఈసారి పార్టీకి కొన్ని ఎదురుదెబ్బలు తగులుతాయని ఆయన అంగీకరించారు.