![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230717-WA0180.jpg)
అనారోగ్యంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన బొప్పాపురం లక్ష్మి (55) గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన, నయం కాకపోవడంతో, జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు భర్త బొప్పాపురం బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.