– ఎమ్మెల్యే అభ్యర్థి గొంగడి సునీత
నవ తెలంగాణ _బొమ్మలరామరం
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకలే బీ ఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగడి సునీత మహేందర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ లు అన్నారు. శనివారం మండలంలోని చీకటి మామిడి గ్రామానికి చెందిన యువకులు భారీ ఎత్తున టిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి పార్టీలోకి వారు ఆహ్వానించారు. చీకటిమామిడిలో గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలు చేశారన్నారు.సబ్బండ వర్గాలకు అభివృద్ధి చేకూర్చేలా కెసిఆర్ ప్రకటించిన ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయని, సంక్షేమానికి ప్రత్యక్షంగా పెద్ద పీట వేశారని అన్నారు. రాబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు