నవతెలంగాణ- మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలో యువత కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ చేరికల జోరు ఊపందుకొంటుంది.ఆదివారం మండలంలోని గాధంపల్లి,కొయ్యుర్, తాడిచెర్ల గ్రామాలకు చెందిన యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి శ్రీపాద ట్రస్టు చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు హస్తం కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ యువత కోసం ప్రవేశపెట్టిన యువ వికాసం పథకానికి ఆకర్షనీతులై యువత కాంగ్రెస్ వైపు చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ తోపాటు పలువురు పాల్గొన్నారు.
మంథని నియోజకవర్గంలో యువత కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ చేరికల జోరు ఊపందుకొంటుంది.ఆదివారం మండలంలోని గాధంపల్లి,కొయ్యుర్, తాడిచెర్ల గ్రామాలకు చెందిన యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి శ్రీపాద ట్రస్టు చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు హస్తం కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ యువత కోసం ప్రవేశపెట్టిన యువ వికాసం పథకానికి ఆకర్షనీతులై యువత కాంగ్రెస్ వైపు చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ తోపాటు పలువురు పాల్గొన్నారు.