నవతెలంగాణ- హైదరాబాద్: బ్రిటన్కు చెందిన జంతు శాస్త్రవేత్త కుక్కల పట్ల అత్యంత కృరమైన చర్యలకు పాల్పడ్డాడు. శునకాలపై లైంగికదాడి చేసి తన పశు వాంఛను తీర్చుకున్నాడు. తర్వాత కుక్కలను హింసించి, చంపేసి వీడియోలు తీసి.. ఆన్లైన్లో పోస్ట్ చేసినట్టు అంగీకరించాడు. బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్లతో కలిసి పనిచేసిన జంతుశాస్త్రవేత్త ఆడమ్ బ్రిటన్.. డజన్ల కొద్దీ కుక్కలను చనిపోయే వరకు హింసించినట్టు ఆస్ట్రేలియా కోర్టుకు వెల్లడించాడు. అతడి క్రూరత్వానికి సంబంధించినవన్నీ కెమెరాలో ఉన్నాయి. ఆన్లైన్లో చిన్నారుల అశ్లీల వీడియోలు సహా 60 ఆరోపణలలో తన నేరాలను అంగీకరించిన దోషికి ఇంకా శిక్ష ఖరారు కాలేదు. కేసు విచారణ సందర్భంగా హాలులో ఉన్నవారిని బయటకు వెళ్లిపోవాలని నార్తర్న్ టెరిటరీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి సూచించారు. ఘోరమైన నేరాలకు పాల్పడ్డాడని, ఆ వివరాలు తెలిస్తే షాక్లోకి వెళ్లిపోయే అవకాశం ఉన్నందున కోర్టు గది నుంచి ప్రజలను బయటకు వెళ్లమని హెచ్చరించారని స్థానిక మీడియా తెలిపింది. బ్రిటన్కు 2014 నుంచి జంతువులపై శాడిస్ట్ లైంగిక ఆసక్తి ఉందని, తన పెంపుడు శునకాలతో పాటు ఇతర యజమానులు వదిలిపెట్టిన కుక్కలపై కూడా అత్యాచారానికి పాల్పడ్డినట్టు ప్రాసిక్యూటర్లు చెప్పారు. ప్రయాణాలు లేదా పనిపై బయటకు వెళ్లేవారి పెంపుడు జంతువులను తన అదుపులోకి ఉంచుకోవడానికి ప్రయత్నించాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. కట్టుకథలతో మోసపూరితంగా యజమానుల నుంచి పెంపుడు జంతువులను తీసుకునేవాడని వివరించారు. జంతువులపై లైంగిక దాడికి ఓ షిప్పింగ్ కంటెయిన్ర్ను ఏర్పాటు చేసుకున్నాడు. టార్చర్ రూమ్గా పేర్కొన్న కంటెయినర్లో వీడియో రికార్డింగ్ సాధనాలను కూడా ఏర్పాటు చేశాడు. జువాలజీలో పీహెచ్డీ చేసి, చార్లెస్ డార్విన్ యూనివర్శిటీలో అకడమిక్ హోదాలో ఉన్న బ్రిటన్.. బీబీసీ, ఎన్జీసీలతో కలిసి పనిచేశాడు. కుక్కలపై అత్యాచారం చేస్తున్న వీడియో బయటపడటంతో నార్తర్న్ టెరిటరీ పోలీసులు 2022లో అతడ్ని అరెస్టు చేశారు. నేరాలకు సంబంధించి పక్కా ఆధారాలు, సాక్ష్యాలు లభ్యం కావడంతో బ్రిటన్ను న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. అతడికి డిసెంబర్లో శిక్ష ఖరారు కానుంది. అరెస్టుకు ముందు ఏడాదిన్నర వ్యవధిలో అతడు వేధించిన 42 కుక్కల్లో 39 చనిపోయాయని నివేదిక పేర్కొంది.