ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ

– త్రిపురలో స్వేచ్ఛగా ఎన్నికలకై చర్యలు : సీపీఐ(ఎం) పిలుపు
కోల్‌కతా : త్రిపురలో స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరిగేలా అక్కడ ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలనీ, త్రిపుర ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ, కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా భారత కమ్యూనిస్టు (మార్క్సిస్ట్‌) పార్టీ కేంద్ర కమిటీ పిలుపిచ్చింది. ప్రజల జీవనోపాధులపై కొనసాగుతున్న దాడులను నిరసిస్తూ ఫిబ్రవరి చివరి వారంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణ చేపట్టాలని పిలుపిచ్చింది. ఈ నెల 28, 29 తేదీల్లో కోల్‌కతాలో సమావేశమైన పార్టీ కేంద్ర కమిటీ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది.
అదానీ గ్రూప్‌పై ఆరోపణలు
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ చేసిన ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ తప్పనిసరి. ఈ విచారణను సుప్రీం కోర్టు రోజువారీ ప్రాతిపదికన పర్యవేక్షించాలి. విచారణ పూర్తయి, వాస్తవాలు వెల్లడయ్యేవరకు భారతదేశ, ప్రజల ప్రయోజనాలు పరిరక్షించబడాలి. ఎల్‌ఐసికి చెందిన దాదాపు రూ.80వేల కోట్లు అదానీ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. అదానీ గ్రూపు జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రుణాల్లో దాదాపు 40శాతం ఎస్‌బీఐ ద్వారా తీసుకున్నవే. కోట్లాదిమంది భారతీయులు తమ భవిష్యత్‌ భద్రత కోసం జీవితకాలం దాచుకున్న పొదుపు మొత్తాలను ఎల్‌ఐసీ, ఎస్‌బీఐల్లో పెట్టారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలుగు చూసినప్పటి నుంచి స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూపుల పెట్టుబడుల సమీకరణ ఏకంగా 5వేల కోట్ల డాలర్లకు పైగానే పడిపోయి నందున, ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రజల జీవితకాలపు పొదుపు మొత్తాలను ధ్వంసం చేయడానికి, ఇది దారి తీయరాదు. సీపీఐ(ఎం) ఇతర లౌకిక ప్రతిపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుని రాబోయే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అదానీ అంశాన్ని లేవనెత్తుతుంది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ
మాంద్యం ధోరణులు ఉధృతమవుతుండడంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ తడబడడం కొనసాగుతోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ప్రభుత్వం ప్రచారాలు, ప్రకటనలు చేస్తున్నప్పటికీ, భారతదేశ ఉత్పాదక సామర్ధ్యాలను పెంచేలా పెట్టుబడులు పెరగడం లేదు. అంటే ఉపాధి కల్పన స్తబ్దుగా వుందని అర్ధమవుతోంది. క్షీణించకపోయినా మరింతగా దారిద్య్రం, ఇబ్బందులు పెరగడానికి దోహదపడుతోంది.
అభ్యంతరకర రీతిలో అసమానతల విస్తరణ
40శాతానికి పైగా ప్రజల సంపదంతా కేవలం ఒక ఒక్క శాతం మంది దగ్గర పోగు పడిందంటూ ‘సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌ : ది ఇండియా సప్లి మెంట్‌’ శీర్షికతో విడుదల చేసిన ఆక్స్‌ఫామ్‌ నివేదిక పేర్కొంది. దేశంలో 10 మంది సుసంపన్నుల మొత్తం సంపద 2022లో రూ.27.52 లక్షల కోట్లు వుంది. 2021తో పోలిస్తే ఇది 32.8శాతం ఎక్కువ. కిందిస్థాయిలోని 50 శాతం మంది జనాభా వద్ద కేవలం 3శాతం సంపద మాత్రమే నెలకొంది. 2020లో మొత్తం శత కోటీశ్వరుల సంఖ్య 102గా వుండగా, 2022లో ఈ సంఖ్య 166కి పెరిగింది. దీనికి పూర్తి విరుద్ధంగా దాదాపు 23కోట్ల మంది ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్నారు. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం.భారతదేశంలోని తిరోగమన పన్నుల వ్యవస్థను ప్రస్తావిస్తూ, అత్యున్నత స్థాయిలోని 10శాతం మందితో పోలిస్తే దిగువున గల 50శాతం మంది జనాభా ఆదాయ శాతంగా పరోక్ష పన్నుపై ఆరు రెట్లు ఎక్కువగా చెల్లిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఆహారం, ఆహారేతర నిత్యావసరాల నుండి వసూలు చేసిన మొత్తం పన్నుల్లో దిగువ 50శాతం మంది 64.3శాతం చెల్లిస్తున్నారు. మోడీ ప్రభుత్వం సంపన్నులకు ఇస్తూ వస్తున్న పన్ను రాయితీలను సవరించాల్సిన సమయం ఆసన్నమైంది. సంపద పన్ను, వారసత్వపు పన్నులను ప్రవేశపెట్టాలి. అన్ని నిత్యావస రాలపై ముఖ్యంగా ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలి.
పదును తేలుతున్న మతోన్మాద ధోరణులు
మతోన్మాద ధోరణులను మరింత పదును తేల్చడానికి వివిధ మార్గాల్లో ఉధృతంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తమ రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలుతో ముందుకు సాగుతామని బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రకటించాయి. దీని వెనుకనే ముస్లిం పర్సనల్‌ లాను రద్దు చేయాలంటూ కఠినమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇప్పటికే లవ్‌ జిహాద్‌ లేదా గో సంరక్షణ పేరుతో ముస్లిం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటూ బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చట్టాలను రూపొందించాయి. స్వచ్ఛందంగా మత మార్పిడి, మతాంతర వివాహాలను నిషేధిస్తూ అందులో షరతులు రూపొందించారు. విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్ధులపై ప్రమాదకరమైన రీతిలో విద్వేష ప్రచారం ఉధృతమవుతోందన్న వార్తలు కూడా పెరుగుతున్నాయి. ముస్లిం మైనారిటీల మౌలిక రాజ్యాంగ హామీలను తిరస్కరిస్తూ అభ్యంతరకరమైన రీతిలో మతోన్మాద దృక్పథాన్ని ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ప్రభుత్వం దూకుడుగా అనుసరిస్తోంది. ఇటీవలే, ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో ప్రఖ్యాతి చెందిన ఉర్దూ ప్రార్ధనా గీతాన్ని పాడుతున్న పిల్లలను ఆ స్కూలు ప్రిన్సిపల్‌ సస్పెండ్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తర బస్తర్‌ జిల్లాలో క్రైస్తవులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నాయని సాకుగా చూపిస్తూ దాడులకు పాల్పడ్డారు. కానీ వాస్తవాలు పరిశీలించగా అది నిజం కాదని తేలింది.
బలవంతంగా మత మార్పిడి జరిగిన కేసు ఒక్కటి కూడా లేదని వెల్లడైంది. క్రైస్తవ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని, దాడులకు పాల్పడాలన్న ఎజెండాను వారు ఇక్కడ అనుసరించారని, అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల ప్రాపకంలో బజరంగ్‌ దళ్‌ చేపట్టిన ‘ఘర్‌ వాపసి’ని ఆమోదించేలా వారిపై ఒత్తిడి తీసుకువచ్చారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై హింసతో నేరపూరిత దాడులు జరిగాయి. అంతర్జాతీయ టోర్నమెంట్‌ల్లో పతకాలు గెలుచుకున్న మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటు ప్రభుత్వం లేదా ఇటు పార్టీ ఎవరూ కూడా ఆయనపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. బిల్కిస్‌ బానో కేసులో దోషుల యావజ్జీవ శిక్షను తగ్గించిన వెంటనే 2014 జూన్‌లో పూనేలో మొహిసిన్‌ షేక్‌ కేసులో అల్లర్లకు పాల్పడిన 21మంది నిందితులనూ నిర్దోషులుగా విడిచిపెట్టారు. హిందూత్వ శక్తులు ఈ చర్యను స్వాగతించాయి. దీన్ని సవాలు చేస్తూ పై కోర్టులో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఇంతవరకు పిటిషన్‌ దాఖలు చేయలేదు.
దెబ్బ తింటున్న న్యాయ వ్యవస్థ స్వేచ్ఛ
తమకు అనుకూలంగా వ్యవహరించే న్యాయ వ్యవస్థ వుండాలని కోరుకుంటున్న ప్రభుత్వం, సుప్రీం కోర్టు, హైకోర్టు కొలీజియంలు సిఫార్సు చేసిన వివిధ పేర్లకు ఆమోద ముద్ర వేయడంలో జాప్యం చేయడం లేదా తిరస్కరించడం ద్వారా హైకోర్టులు, సుప్రీం కోర్టుకు న్యాయమూర్తుల నియామకాల్లో జోక్యం చేసుకుంటోంది. అత్యున్నత న్యాయ స్థానం ప్రభుత్వానికి లొంగి వుండాలన్నది మోడీ ప్రభుత్వ లక్ష్యంగా వుంది. రాజ్యాంగ పథకం ప్రకారం, న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రం క్షీణించడమన్నది నియంతృత్వం పూర్తి ఆధిపత్య ధోరణికి అద్దం పడుతుంది.
గవర్నర్ల పాత్ర
సమాఖ్యవాదంపై దాడిని ఉధృతం చేసేలా, బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు తమ రాజ్యాంగ పదవిని దారుణంగా ఉల్లంఘిస్తూ, పాలక పార్టీ రాజకీయ లక్ష్ల్యాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కేరళ, తెలంగాణా, మహారాష్ట్ర, ఇప్పుడు తమిళనాడు గవర్నర్లు, ఢిల్లీ లక్షద్వీప్‌, అండమాన్‌, పుదుచ్చేరి ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు వారి రాజ్యాంగ పదవులను ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ పాత్రను దెబ్బ తీయడానికి, ఫెడరల్‌ వ్యతిరేక ధోరణిని కొట్టిపారేయడానికి, అధికారాల కేంద్రీకరణకు మొగ్గు చూపడానికి గవర్నర్‌ కార్యాలయాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు
భయోత్పాత రాజకీయాలకు, హింసకు పాల్పడుతున్న, ప్రజాస్వామ్యా న్ని, చట్టబద్ధ పాలనను దెబ్బతీస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించేందుకు గానూ త్రిపురలో అన్ని లౌకికవాద ప్రజాస్వామిక శక్తుల సహకారాన్ని సీపీఐ(ఎం) కోరుతోంది. భయానక, భీతావహ వాతా వరణాన్ని సృష్టించడం ద్వారా స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికల నిర్వహణను దెబ్బ తీసే లక్ష్యంతోనే ఈ హింసాత్మక ధోరణి వుంది. ఇక్కడ ఎన్నికల కమిషన్‌ తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టాల్సి వుంది. త్రిపురలో స్వేచ్ఛ గా, సక్రమంగా ఎన్నికలు జరిగేలా చూసేందుకు తక్షణమే క్రియాశీల జోక్యం చేసుకోవాల్సిన అవసరం వుంది. త్రిపురలో స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరగాలంటే అక్కడ ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించబడాలి.
కేంద్ర కమిటీ పిలుపు
1.త్రిపురలో స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించేందుకు గానూ ముందుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించేందుకై ప్రజలకు, లౌకికవాద ప్రజాస్వామిక శక్తులకు సంఘీభావం ప్రకటించాలి. సంఘీభావాన్ని ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా సీపీఐ(ఎం) కార్యక్రమాలను నిర్వహించాలి
2. పెరుగుతున్న నిరుద్యోగం, దారిద్య్రం, అసమానతలతో ప్రజల జీవనోపాధులపై దాడులు కొనసాగడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి చివరి వారంలో 22 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణ చేపట్టాలి.
2023-24 కేంద్ర బడ్జెట్‌లో లేవనెత్తే అంశాలతో పాటూ, ఈ నిరసన కార్యాచరణ ప్రచారాలు ఈ క్రింది డిమాండ్లను ప్రస్తావించాలి.
– ఉపాధి అవకాశాలను సృష్టించే మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి.
– 5కిలోల ఉచిత ఆహార ధాన్యాలతో పాటూ 5కిలోల సబ్సిడీ ఆహార ధాన్యాలను పునరుద్ధరించాలి.
– అధిక వేతనాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అపారంగా కేటాయింపులు పెంచాలి.
– సంపద, వారసత్వ పన్నులను విధించాలి
– సంపన్నులకు పన్ను రాయితీలను ఉపసంహరించాలి. అతి సంపన్నులపై పన్ను విధించాలి.- ఆహారం, మందులతో సహా నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఉపసంహరించాలి.
3.ఏప్రిల్‌ 5న పార్లమెంట్‌కు ర్యాలీని నిర్వహించాలన్న మజ్దూర్‌-కిసాన్‌ పిలుపునకు సీపీఐ(ఎం) పూర్తి మద్దతును ప్రకటించింది.మార్చి మాసంలో దేశవ్యాప్తంగా ఈ క్రింది అంశాలపై సీపీఐ(ఎం) రాజకీయ ప్రచారాలు, కార్యకలాపాలను చేపట్టాలి.
(ఎ) సమాఖ్యవాదంపై పెరుగుతున్న దాడులతో, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టే విధానాలను నిరసిస్తూ, ఫెడరల్‌ నిర్మాణాన్ని నాశనం చేస్తూ, ఏకీకృత దేశ నిర్మాణాన్ని ప్రజలపై రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ
(బి) న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నిరసించేలా ప్రచారాలు. అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి విధేయంగా వ్యవహరించేం దుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ యొక్క రాజ్యాంగ పాత్రను సమర్ధించుకోవడానికి అన్ని ప్రజాస్వామిక శక్తులను సమీకరించాలి.
(సి) స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరిగేలా చూసేందుకు ఎన్నికల సంస్కరణల్లో ప్రజాస్వామ్య, సమాన అవకాశాలు కల్పించడం కోసం. సీపీఐ(ఎం) 23వ మహాసభ తన రాజకీయ తీర్మానంలో అత్యవసరంగా ప్రవేశపెట్టాల్సిన ఎన్నికల రూపాలను ప్రముఖంగా ప్రస్తావించింది.(డి) పాలస్తీనా ప్రజలకు సంఘీ భావంగా, అక్కడి మితవాద ఇజ్రాయిల్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గమైన అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలి.

Spread the love
Latest updates news (2024-07-07 09:03):

what vitamin is good for male sex Lks drive | nitric oxide booster gnc tQG | big sale male engancement | mojo most effective risen pills | viagra alternatives CRt over the counter philippines | viagra similar cbd cream pills | do erectile dysfunction pumps H4y while on eliquis | free trial womens libedo | YdA garcinia cambogia pills walmart | amlodipine Ofn besylate cause erectile dysfunction | medicine to make a girl QWr wet | nitroglycerin over the 4pb counter medication | tips to increase n5l pennis size | image natural male ykh enhancement pills at walmart | progesterone erectile dysfunction official | gtn Wal spray erectile dysfunction | online shop wave erectile dysfunction | sexual pills for woman 0Pe | nx ultra FDj male enhancement | viagra in hindi cbd cream | viagra mom free trial | what rhino pills KYm work best | is it safe to take viagra VYj after expiration date | vigornow vyc male enhancement us | cbd oil sex com 3 | free shipping my bost | viagra blue vision reddit 8i3 | natural male srS potency herbs | does chewing up OJ5 viagra work faster | how to FDS enlarge your oenis | male enhancement pills at Oip wawa | can low calcium cause W2a erectile dysfunction | viagra cbd vape manufacturer pfizer | reversing erectile dysfunction free trial | Afm behavioral health erectile dysfunction | boosting testosterone in men 1KV over 40 | get hard fast and stay hard frT | super power YUF male enhancement | where can i Un5 buy male enhancement | herbs for sexual S99 arousal | schwinng male MtQ enhancement retailers | how to make your package oGA bigger | delay spray for men ebay y05 | most effective cialis half life | kyo lWB green side effects | sexual enhancement pills 6k 8Dx | cbd cream viagra russian band | can sumatriptan get you high 7RF | homemade for sale prostate stimulation | good for genuine sex