రెండు చెంచాల బొప్పాయి గింజలను మిక్సీలో గరుకు మిశ్రమంగా చేసుకోవాలి. ఇందులో రెండు చెంచాల ఓట్స్ పొడి, చెంచా తేనె కలిపి ముఖానికి మృదువుగా రాసి అయిదు నిమిషాలు రుద్ది ఆరనివ్వాలి. ఆపై చల్లని నీటితో కడిగితే ముఖంపై పేరుకొన్న మృతకణాలు, మురికి దూరమై చర్మం మెరుపులీనుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా ఉంటాయి.