నవతెలంగాణ – హైదరాబాద్
ఇండోర్ టెస్టులో భారత్ మరింత కష్టాల్లో పడింది. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లయాన్ దెబ్బకు ఆరో వికెట్ కోల్పోయింది. లయాన్ ఓవర్లో కేఎస్ భరత్ (3) బౌల్డ్ అయ్యాడు. దాంతో 118 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మరో వైపు ఛటేశ్వర్ పుజారా (51) ఓపికగా ఆడుతూ ఆసీస్ బౌలర్లకు పరీక్ష పెడుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇండియా 30 పరుగుల ఆధిక్యంలో ఉంది. లయాన్ నాలుగు వికెట్లు తీశాడు.