– మంత్రి హరీశ్ రావుకు స్టాఫ్ నర్సుల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 5204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లో ఆర్థికశాఖ అనుమతించిన 1,827 పోస్టులను విలీనం చేయాలని పలువురు స్టాఫ్ నర్సులు కోరారు. ఈ మేరకు మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,031 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఆస్పత్రుల్లో రోగుల సేవలకు అంతరాయం కలగకుండా ఉంటుందనీ, ప్రభుత్వానికి మరో నోటిఫికేషన్ వేసే భారం కూడా తప్పుతుందని సూచించారు. గతంలో టీఎస్పీఎస్సీ 2017 స్టాఫ్ నర్సు నోటిఫికేషన్లో మొదట 1,196 భర్తీ చేస్తున్నట్టు ప్రకటించి ఆ తర్వాత మరి కొన్ని పోస్టులను కలపడం ద్వారా 3,311 పోస్టులను భర్తీ చేసిందని వారు గుర్తుచేశారు. మంత్రికి వినతిపత్రం అందించిన వారిలో స్టాఫ్ నర్సులు కురుమేటి గోవర్థన్, ప్రశాంతి, సంతోష్, రజిత, సరిత, అన్నమయ్య తదితరులున్నారు.