నవతెలంగాణ-గోవిందరావుపేట: తమతో పాటు చదువుకున్న బాల్య స్నేహితుడు మృతి చెందగా స్నేహితుని కుటుంబానికి మిత్రులంతా 38 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. మండల కేంద్రంలో ఎలగంధుల సాంబశివరావు ఇటీవల మృతిచెందగా సాంబశివరావు బాల్యమిత్రులు ఆర్థికంగా ఆదుకోవాలని 38 వేల రూపాయలను మృతుని కుటుంబానికి మంగళవారం అందించారు. 1990-91 వ సంవత్సరంలో సాంబశివరావు తో పాటు పదవ తరగతి చదివిన బాల్యమిత్రులు ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు.కాగా మృతునికి భార్యతో పాటు ఇద్దరు వికలాంగులైన పిల్లలు ఉన్నారు. భవిష్యత్తులో కూడా కొంతమేర ఆర్థికంగా ఆదుకుంటామని బాల్య మిత్రులు భరోసా కల్పించారు. చిన్ననాటి స్నేహితులు అందించిన ఆర్థిక సహాయానికి సాంబశివరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.