నవతెలంగాణ-బంజారాహిల్స్
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని 24 00 ఎకరాలు 50వేల మంది మన్సూరాబాద్ గ్రామంలో పేదలకు కేటాయించిన భూములను వారికి చెందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది షేక్ జిలానీ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన్సూరాబాద్ గ్రామంలోని సర్వే నం. 1 నుంచి 14, 15 నుంచి 20 వరకు సుమారు 2,400 ఎకరాల భూమి 1947లో హనీఫా బీ వారసత్వంగా తీసుకున్నారని తెలిపారు ఆమె మరణానంతరం కుమార్తె అఫ్టల్ సుల్తానాకు, ఆమె చనిపోయిన తర్వాత వారసత్వంగా కుమారుడు యూ సుఫ్ ఖాన్ ఆ భూమిపై హక్కులు పొం దారన్నారు. 2019లో యూసుఫ్ ఖాన్ సదరు భూము లను 50 వేల మంది పేదలను గుర్తించి ఒక్కొక్కరికి వంద గజాల చొప్పున ఉచితంగా అందించారన్నారు. అయితే సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ భూములన్ని ప్రభుత్వానికి చెందుతుందని మెమో జారీ చేశారని, దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తే రికార్డుల ప్రకారం ఈ భూమి యూసుఫ్ ఖాన్ ఇష్టపూర్వకంగా పేదలకు ఇచ్చారని, వారికే చెందుతుందని తీర్పునిచ్చా రన్నారు. ఆ తీర్పు ప్రకారం పేదలకే చెందేలా ప్రభుత్వం కషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో షేక్ యజ్ఞానీ, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.