నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఓ కళాశాల విద్యార్థినిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి, లైంగికదాడి చేశారు. ఆ తర్వాత మొబైల్తో ఆమె ఫొటోలు తీసి.. ఎవరితోనూ చెప్పొద్దని బెదిరించారు. మందిర్ బజార్ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ నేరం జరిగింది. బ్యాంకుకు వెళ్లిన యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు సికందర్పుర్ జంక్షనులో ఎవరూ లేని ఓ ఇంట్లోకి తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. అదేరోజు రాత్రే తాము ఫిర్యాదు చేసినా పోలీసులు నిందితులపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోకుండా అలసత్వం చూపుతున్నారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. వైద్యపరీక్షల అనంతరం బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.