– ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ -కమ్మర్ పల్లి
నవంబర్ 2న బాల్కొండ నియోజకవర్గంలో జరిగే ముఖ్యమంత్రి కేసిఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేల్పూర్ మండలంలోని స్పైస్ పార్క్ వేదికగా జరగనున్న సభ ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా జరుగుతున్న ఏర్పాట్లలో పలు సూచనలు చేశారు. సీఎం సభాస్థలి, పార్కింగ్, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఈ సందర్భంగా సభా ఏర్పాటు పరిశీలకులకు పలు సూచనలు చేశారు.