– జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు పెండ్యాల మహేష్
నవతెలంగాణ-రామగిరి: రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ ఐఎన్టీయూసీ కార్యాలయంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు బండారి సదానందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చిన పెద్దపల్లి జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షుడు పెండ్యాల మహేష్ హాజరై మాట్లాడారు. బలహీన వర్గాల ద్రోహి కెసిఆర్ కి ప్రజాక్షేత్రంలో ఓటుతో బుద్ది చెప్పాలని, బహుజనుల ఆశ జ్యోతి శ్రీదర్ బాబును బారి మెజార్టీ తో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన బారాస అధినేత కేసిఆర్ మాట్లాడుతూ, ఇక్కడ బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చారని బీసీలందరు ఓటేయాలని చెప్పడం నిజంగా సిగ్గుచేటు అని దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా బీసీలను అణగదొక్కి బహుజనులకు అన్యాయం చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసి, ఎన్నికల సమయంలోనే సంక్షేమ పథకాల పేరుతో మాయమాటలతో కల్లబొల్లి మాటలతో పిట్టలదొర మాటలతో ప్రజలను పక్కదోవ పట్టించే కేసీఆర్కు ప్రజాక్షేత్రంలో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అలాగే ఈ ప్రాంతంలో అజాతశత్రువుగా మచ్చలేని నాయకుడిగా చదువుకున్న వ్యక్తిగా మంథని ప్రాంతాన్ని చదువుల తల్లికి నిలయంగా మార్చిన ఏఐసీసీ కార్యదర్శి మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబ చేతి గుర్తు మీద ఓటు వేసి కేసిఆర్ కు బుద్ధి చెప్పాలని అన్నారు. అలాగే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి గిఫ్ట్ గా ఇవ్వాలని శ్రీధర్ బాబు అనేకమంది బహుజన నాయకులను తయారు చేయడమే కాకుండా చదువు విషయంలో ఉద్యోగ విషయంలో వైద్యం విషయంలో ప్రతి అంశంలో కూడా బహుజన పక్షాన నిలబడ్డ బహుజన నాయకుడు శ్రీధర్ బాబు అవడానికి అగ్రవర్ణం అయినా కూడా ఆయన ఆలోచన విధానం ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుందని అన్నారు. కాబట్టి మంథని నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈనెల 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో చేతి గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీ శ్రీధర్ బాబును గెలిపించి అరాచక పాలనకు దొర గడీల పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రొడ్డ బాపు, ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికారి కిషన్, మంథని డివిజన్ అధ్యక్షులు రవితేజ గౌడ్, మంథని మండల బిసి సెల్ అధ్యక్షుడు అయిలి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి జంగపల్లి రవి, మంథని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, గ్రామ శాఖ బీసీ సెల్ అధ్యక్షులు గట్టు విజయ్, అరుణ్ కుమార్, మాటేటి సాగర్ రాములు, చెవుల కోటి, వీరవేణి రాజమౌళి గౌడ్, మామిడి హరీష్, మాసా అశోక్, బండారి ప్రసాద్, కాసెట్టి తిరుపతి, కొలిపాక తిరుపతి, ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.