– బీజేపీ నుండి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
నవతెలంగాణ-కాశిబుగ్గ
వర్ధన్నపేట నియోజకవర్గం నుండి తనకు మరోసారి అవకాశం కల్పిస్తే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ సుందరయ్యనగర్లో బిఆర్ఎస్ జిల్లా నాయ కుడు గండ్రాతి భాస్కర్ ఆధ్వర్యంలో ఆరూరి రమేష్ సమక్షంలో బిజెపి నుండి యువత భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆరూరి రమేష్ గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస,్ బిజెపి పార్టీల నుండి బీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారన్నారు. గత పది సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజల ఆపదలో, కరోనా కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నా నన్నారు. వర్ధన్నపేట నుండి తనకు రెండుసార్లు అవకాశం కల్పిస్తే ఎలాంటి రాజకీయ తగాదాలకు ఘర్షణలకు తావివ్వకుండా అభివృద్ధిపైనే దృష్టి సారిం చానన్నారు. వరంగల్ అంటేనే విప్లవాల గడ్డ అని, కాంగ్రెస్ అభ్యర్థి పోలీసు శాఖలో ఎస్సై స్థాయి నుండి పోలీస్ కమిషనర్ స్థాయికి వెళ్లేందుకు ఎంతోమంది విప్లవకారులను, ఉద్యమకారులను ఎన్ కౌంటర్ పేరుతో వారి రక్తాన్ని చవి చూసి, వారి కుటుంబాలను బలి తీసుకున్నాడన్నారు. బిజెపి అభ్యర్థి గతంలో ఐదేళ్లు ఎమ్మెల్యే గా ఉండి ఏం అభివృద్ధి చేశాడో ప్రజలంతా గమనించాలన్నారు. పార్టీలో కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలని కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందన్నారు. బిజెపి నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో మామిడాల లింగమూర్తి, మారు జోడు నవీన్, మాచన రాజేష్, కొంతం నాగరాజు, చల్ల సంతోష్, హన్మకొండ విజరు, స్వామి, అర్జున్, తదిత రులున్నారు. ఈకార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, జిల్లా నాయకుడు దుబ్బ శ్రీనివాస్, ఎన్నికల ఇంచార్జ్ ఊకంటి వనంరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ, సుందరయ్య నగర్ శాఖ అధ్యక్షుడు జంగం రాజు, కార్యదర్శి గండ్రాతి నవీన్, డివిజన్ యూత్ అధ్యక్షుడు సత్పటి సంతోష్, నాయకులు ఎండి అజాం, కొంగర సుదర్శన్, ఎండి అఫ్జల్, ఎండి సలీం, అంకేశ్వరపు సతీష్, రంగరాజు విజయ, కొత్తపల్లి అనిల్, కొత్తపల్లి సునీల్, డోజర్ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.