– సాధరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే నరేందర్
నవతెలంగాణ-మట్టెవాడ
చిన్నవడ్డేపల్లి సమీపంలోని ఎంహెచ్నగర్ భూపోరాట కమిటీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దుబ్బ శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్, భోగి సురేష్లు సంయుక్తంగా శివనగర్ లోని సాయి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు ఎంఏచ్ నగర్ గుడిసెవాసుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే, వరంగల్ తూర్పు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. .ఈ సందర్భంగా గుడిసెవాసులకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి నాయకులు మోసం చేసి తమను ఆగం చేసారని ఎమ్మెల్యే నరేందర్ కు తమ సమస్యలను తెలిపి గుడిసెవాసుల పక్షాన నిలబడి ఇప్పటికే చాలామందికి పట్టాలు ఇప్పించిన నరేందర్ వెంటే వుంటామంటూ 1600వందల కుటుంబాలు ముక్తకంఠంతో ఎమ్మెల్యే నరేందర్ కు ఓటేస్తామని ప్రతిజ్ఞ చేసి మూకుమ్మడిగా ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో సోమవారం చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ నాయకులను నమ్మి మీ గుడిసేవాసులు ఎంత మోస పోయిల్లు ఎంత ఆగమయ్యారనేది నాకు తెలుసు అక్కడున్న కొంతమంది నాయకులు నామీద దుష్ప్రచారం చేస్తున్నారు. నా చరిత్రలో ఒక్క గుడిసే జోలికి పోలే. గుడిసెవాసుల పక్షాన నిలబడి పట్టాలు అందించాను. గతంలో మాట ఇచ్చిన విధంగా గొప్పగా రోడ్లు, మోరీలు మౌలిక వసతులు ఏర్పాటు చేశాను. జక్కలొద్దిలో కూడా సీపీఎం నాయకులను నమ్మి మోస పోయారు. వాళ్ళు నన్ను సంప్రదించి నా వెంట ఉంటామని మూకుమ్మడిగా 8వేల మంది నాకు మద్దతు తెలిపారు. నేను నియోజకవర్గంలో గుడిసె సెంటర్లో దరఖాస్తు కేంద్రం పెట్టి అప్లై చేసి, కనీస అవసరాలు ఏర్పాటు చేసి పట్టాలు ఇచ్చిన చరిత్ర నాది. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి మీకు స్థలం కేటాయించి పట్టాలు చేతిలో పెట్టె జిమ్మేదారి నాది. 16వందల కుటుంబాలకు న్యాయం చేస్తాను. మీరందరు ఒక్కటిగా ఉండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దుబ్బ శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.