– పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి రేవూరి
నవతెలంగాణ-సంగెం
ఎన్నికల వేళ అధికార బీఆఆర్ స్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మండలంలోని మొండ్రాయి, నల్లవెల్లి గ్రామాలకు చెందిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార పార్టీ పై వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిగ్గా వినియోగించుకుంటున్నారు అధికార పార్టీలో ఉన్న లోకల్ నాయకులు దురుకుగా ప్రవర్తిస్తున్నారని, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. పుండు మీద కారం చల్లినట్టు అసంతృప్తితో ఉన్న నేతలను చిన్నచూపు చూసి వారిని తక్కువ చేసి మాట్లాడడం వారు జీర్ణించుకోలేక అధికార పార్టీని వీడుతున్నారని కాంగ్రెస్లో చేరిన సీనియర్ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీని వీడుతున్నామని తెలిపారు. పార్టీలో చేరిన వారికి పరకాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి కండువా కప్పి వారిని సాధారంగా ఆహ్వానించారు. మొండ్రాయి గ్రామానికి చెందిన వడ్లకొండ వాసు ఇటీవల గ్రామ పార్టీ అధ్యక్షుడై తన మార్కును చూపించడంలో తనదైన శైలిని చూపిస్తూ అధికార పార్టీ సీనియర్ నాయకులను, వార్డు మెంబర్లను, కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మొండ్రాయి నుండి కొనుకటి సంపత్, యార సంపత్, పరికి ఏలియ, పరికి శోభన్ నల్లవెల్లి గ్రామం నుండి మెరుగు మల్లయ్య, కాగితాల శ్రవణ్, నీరటి సమ్మయ్య, వల్లే అశోక్, గోనె రాజేందర్, పెండ్లి రాజు, శ్రావణ్, రవి, శ్రీకాంత్, సింగిరెడ్డి రాజు, ఎరుకల ప్రతాప్, పెళ్లి శ్యామ్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు వడ్లకొండ వాసు, మడత శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.