నవతెలంగాణ-నెల్లికుదురు
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురులోనీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు వర్ధంతి నీ ఘనంగా నిర్వహించినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బంటు కవిరాజు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సకట్ల అనిల్ తెలిపారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ బంటు కవిరాజ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు మాట్లాడుతూ ప్రశ్నించడం, ధిక్కారానికి పర్యాయపదం కాళోజీ అని, ఆయన తన కవిత్వంలో నాటి సమాజంలో తెలంగాణ ప్రజలపై, తెలంగాణ భాషపై, తెలంగాణ సంస్కతిపై జరుగుతున్న దాడిని, ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షపై తన రచనలలో తీవ్రంగా ఖండించే వారన్నారు.ఈ కార్యక్రమంలో ఆధ్యాపకులు రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మహేందర్, సుధాకర్, యాకన్న, సతీష్, స్పందన, అధ్యాపకేతర బందం సైదా, ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
మహబూబాబాద్: ప్రజా సమస్యల పరిష్కారానికి చదువు అనివార్యం అని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్లా వెంకట్రెడ్డి అన్నారు సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో కాళోజీ నారాయణరావు వర్ధంతి నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జ కళ్లెం. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాళోజి తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతిధ్వని అని అన్నారు నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి,అరాచక పాలనకు వ్యతిరేకంగా కలం ఎత్తిన మహనీయుడన్నారు. తెలంగాణ సాధన ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలు చైతన్యవంతం కావాలంటే చదువు అనివార్యమని తెలియజేసిన మహానీయులు కాళోజి అన్నారు. అతని జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుప ుకోవడం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గౌరవం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపా ధ్యాయులు గుగులోత్ సత్య శంకర్, దేశ బోయిన వెంకన్న, సిద్దోజు కవిత, పనితి.జనార్ధన్, వి. శశిధర్, బలాస్టి రమేష్,భూక్య బాలాజీ, కారు పోతుల. యుగంధర్, అక్కర. రామాచారి, మహమ్మద్. ఉస్మాన్, షమీ మ్, గుగులోత్. అరుణ,ఎస్.హైమా పాల్గొన్నారు.