– ఎర్రబెల్లి దయాకర్ రావు
– ప్రగతి కావాలంటే, మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలి
– తొర్రూరు కేసీఆర్ సభకు భారీగా తరలి రావాలి
నవతెలంగాణ-పెద్దవంగర
రాష్ట్రంలో బీఆర్ఎస్ తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని కొనియాడారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, సీఎం కేసీఆర్ అన్ని రంగాలను అభివద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రగతి కావాలంటే, మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షించారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని కనివిని ఎరగని రీతిలో అభివద్ధి చేశానని, అభివద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఎన్నికలప్పుడే వచ్చే నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.