నవతెలంగాణ-నర్మెట్ట
సీపీఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ మోకు కనకా రెడ్డి నర్మెట్ట మండలంలోని హనుమంతపూర్ కన్నబో యిన గూడెం వెల్దండ అమ్మాపురం గ్రామాల్లో ఇంటి, ఇంటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నర్మేట్ట మండల పార్టీ ఇంచార్జ్ భూక్యా చందు నాయక్ మాట్లా డుతూ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రజల ఆందోళనల మీద తీవ్రమైన ఆంక్షలు పెడుతున్నారు. ధర్నాచౌక్ పరిరక్షణ కోసం పెద్ద పోరాటమే చేయవల్సి వచ్చింది. రాజకీయాలలో విలువలు దిగజారుతున్నాయి. బూర్జువా పార్టీలలో ఎవరు, ఏపూట, ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ప్రజలపట్ల నిబద్ధత లేదు. డబ్బు ప్రమేయం పెరిగింది. పేద ప్రజల సమస్యల పరిష్కారం పట్ల నిజాయితీ లేదు. ఉచితాల పేరుతో సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకుడే కేసు వేసారు. మోడీ ప్రభు త్వం అదే వైఖరి తీసుకున్నది. స్వార్థ ప్రయోజనాలే తప్ప, రాష్ట్ర సమగ్రాభివద్ధి బూర్జువా పార్టీలకు పట్టదు. హైదరాబాద్ను చూపించి అదే అభివద్ధిగానూ, తెలంగాణా అభివద్ధిగానూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నది. అవినీతికి హద్దుల్లేవు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగటం ఇందుకు ఒక మచ్చుతునుక,ప్రజాసమస్యల పరిష్కరానికి, రాష్ట్ర సమగ్రాభివద్ధి, ప్రజాస్వామ్య హక్కులు, లౌకిక విలువలు, రాజ్యాంగం పునాదుల పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మరియు కేంద్ర ప్రభుత్వంతో పోరాడటానికి శాసనసభలో కమ్యూనిస్టులు అవసరం. అందుకే సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి సీపీఐ(ఎం) అభ్యర్థి మోకు కనకా రెడ్డి ని గెలిపించాలని కోరారు.అయా గ్రామాల పార్టీ సభ్యులు, ప్రజలు, పార్టీ శ్రేయోభిలాషిలు, సానుభూతి పరులు పాల్గొన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు కంతి ఆంజనేయులు, నర్సింహులు, కొన్నే రవీందర్, నాగరాజు, సిద్దులు, కష్ణమూర్తి, పెద్ద శ్రీనువాస్, సుంకు రాజు పాల్గొన్నారు