నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
తొర్రూర్లో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు లక్షలాదిమంది పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నియో జకవర్గంలో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్రావు విజయం సాధిస్తాడని, జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపెళ్లి శ్రీనివాస్, హరిపిరాల సర్పం చ్ రావుల మమత జగదీశ్వర్ రెడ్డి అన్నారు సో మవారం వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం లో భాగంగా వారు మాట్లాడారు. నేడు కేసీఆర్ బహిరంగ సభ తొర్రూర్ పట్టణ కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్నారని అన్నారు. సభకు లక్షలాదిమంది కార్యకర్తలను తరలించాలని నాయకులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో నాలుగో సారి ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అన్నారు. గతంలో ఏ ప్రభు త్వాలు చేయని అభివృద్ధి పను లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించాడాని అన్నారు. నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ప్రతిపక్షాలు ఓర్య లేక కేసీఆర్ ప్రభుత్వం పై బురద చల్లడం జరుగు తుందని అన్నారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వలు రాష్ట్రాలలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బొంద పెట్టాలని అన్నారు. మొన్న పాలకుర్తి లో రేవంత్ రెడ్డి సభలో ఒక దళితుడు దళిత బంధు ఇస్తారా అని అడిగితే అహంకారంతో నిండు సభలో కాలితో తన్ని వెళ్లిపోయిన నాయకుడు రేవంత్ అని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. వెంకట్ నారాయణగౌడ్, సంపత్, అంకుష్, వార్డు సభ్యులు ఎంపీ టీసీ వల్లయ్య,గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండ వెంకన్న, గోపమ్మ,మాజీ సర్పంచ్ గద్దల బిక్షపతి ఉపసర్పంచ్ చేంచర్ల రాజు, డైరెక్టర్ వల్లపు లింగయ్య, పుప్పాల మధు తదితరులు పాల్గొన్నారు.