– దిగజారుడు రాజకీయాలు మానుకో రమణారెడ్డి
– కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ-భూపాలపల్లి
ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నాననే భయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి చిల్లర ఆరోపణలు మానుకోవాలని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కా ర్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కటంగూరి రాం నరసింహారెడ్డి, వైఎస్ఆర్టీపి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి విలే కరుల గండ్ర సత్యనారాయణ రావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో భూపాలపల్లిలో ఓటమి భయం తోనే గండ్ర వెంకటరమణారెడ్డి మాపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, రిటైర్డ్ పోలీస్ అధికారుల కనుసన్నల్లో కొంత మంది మాజీ నక్సల్స్ ముఠాగా ఏర్పడి చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ళపల్లి మండలాల్లో కాంగ్రెస్కు అను కూలంగా పని చేస్తూ,
బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ, వారిని బెదిరించినట్లు చేసిన ఆరోపణలు దొంగే, దొంగ.. దొంగ అన్నట్లుందని జోస్యం చెప్పారు. రమణారెడ్డి నీ దిగజా రుడు రాజకీయాలు మానుకో అని హెచ్చరించారు. భూపాల పల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని ఈ విషయమై జిల్లా ఎస్పీకి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు జీఎస్సార్ తెలిపారు.
జీఎస్ఆర్ గెలుపు కోసం కూతురు ప్రచారం
చిట్యాల : తండ్రి గండ్ర సత్య నారాయణ గెలుపు కోసం కూతురు విస్తత ప్రచారం కార్యక్రమం చేపట్టారు సోమవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్తన్న గెలుపు కోసం తన కూతురు అ నూష ఇంటింటికి గడపగడపకు తిరుగుతూ గండ్ర సత్తన్న చేతి గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అనూషకు రైతులు రైతు కూలీలు వ్యాపార వర్గాలు గండ్ర సత్తన్నను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మద్దతు పలికారు. మా నాన్న రెండుసార్లు ఓటమిపాలైననా ఆ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకొని ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతినిత్యం సేవలందిస్తున్నాడని అన్నా రు. మళ్లీ మూడోసారి మీ ముందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నాడని, గండ్ర సత్యనారాయణ రావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్తన్న ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి ,జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖి రాల మధు వంశీకష్ణ, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,జిల్లా కార్యదర్శి చిలుకల రాయకు మురు, సమన్వయ కమిటీ సభ్యులు కాట్రేవుల సాయిలు, పలేపురాంబబు, ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్దొబ్బెట రమేష్, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా కన్వీనర్ ఏ కు రవి, ఎస్సీ డిపార్ట్మెంట్ మండల అధ్యక్షుడు బొట్ల రవి ః, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి ,గడ్డం కొమురయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, చిట్యాల ఎంపిటిసి-2 దొబ్బేటఅనిల్ నవాబుపేట సర్పంచ్ కసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డి, పాల్గొన్నారు.
బీఆర్ఎస్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు..
రేగొండ : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని పీసీసీ సభ్యులు భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం రేగొండ, గోరి కొత్తపల్లి మండలాలలోని రూపిరేడ్డిపల్లి, చెన్నా పూర్, దామరంచపల్లి, చెంచుపల్లి, రామ గుండాల పల్లి, తిరు మలగిరి, సోమవారం గోరుకొత్తపల్లి మండలం సుల్తాన్పూర్, వెంకటేశ్వర్ల పల్లి, కోనరావుపేట, కొత్తపల్లి, రాజక్క పల్లి, విజయపల్లి, బాలయ్య పల్లి, చిన్నకోడపాక గ్రామాలలో కాంగ్రెస్ ప్రజా దీవన యాత్ర నిర్వహించారు. సత్యనారా యణరావు పాల్గొని ర్యాలీగా వెళ్తూ ఓటు అభ్యర్థించారు. ఆయా గ్రామాల్లోని కార్నర్ సమావేశాల్లో గండ్ర మాట్లా డారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా మోసం చేసిన రమణారెడ్డిని ఓడించాలని అన్నారు. గండ్ర వెంకట రమణారెడ్డి అవకాశవాద రాజకీయాలు మానుకోవాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని సహించేది లేదని అన్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాం నరసింహారెడ్డి, గాజర్ల అశోక్ గౌడ్, కాసర్ల రామ్ రెడ్డి, చాడ రఘునాధ రెడ్డి, దూడపాక శంకర్, వైయస్సార్ టిపి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్, జిల్లా నాయకులు పున్నం రవి, సురం వీరేందర్, పుల్లురి బాబురావు, మండల అధ్యక్షులు ఇప్పకయాల నర్సయ్య, మాజీ జెడ్పిటిసి పత్తి వినోద ప్రభాకర్, సర్పంచ్ బండారి కవిత దేవేందర్, ఎంపీటీసీ గంట గోపాల్, మండల నాయకులు కోలేపాక సాంబయ్య, మేకల బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.