నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని మూడవ వార్డులో గల దళిత అంబేద్కర్ కాలనీ ప్రజలకు తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతుందని ఈ కాలనీ ప్రజలకు నీటి సమస్య వారం రోజుల్లోగా తీర్చకపోతే ధర్నా ఆందోళన చేపడతామని ఆ వార్డు సభ్యురాలు లతా సాయిలు సోమవారం నాడు గ్రామపంచాయతీకి వచ్చి సర్పంచ్ సురేష్ కు గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ కు రాతపూర్వకంగా వినత్పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో ఇంటింటికి కుళాయిలు లేవని బోరు పైప్లైన్ ద్వారా కాలనీకి నీటి సరఫరా చేస్తున్నారని కాలనీ ప్రజలకు నీటి విడుదల సక్రమంగా జరగడం లేదని నీటిని వదిలే వాటర్ మెన్ ను తొలగించాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు బోరు పైప్ లైన్ ద్వారా వచ్చే నీటితో కాలనీ ప్రజలు సతమతమవుతున్నారని ఒకే చోట నీటిని తీసుకు వెళ్ళడానికి గంటల తరబడి సమయం పడుతుందని ఈ కాలనీలో ఇంటింటికి కుళాయిలు బిగించాలని డిమాండ్ చేశారు నీకు సమస్య వారం రోజుల్లో గా తీర్చకపోతే ధర్నా చేపడతామని సర్పంచ్ కు గ్రామ కార్యదర్శికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు