నవతెలంగాణ – హైదరాబాద్
రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర మంత్రులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం సవివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశరావు, పంచాయతీరాజ్, గ్రామీణా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చారు. శాఖ పునర్వ్యవస్థకరణ మూలంగా పీఆర్ ఇంజినీరింగ్ శాఖ పనితీరు చాలా మెరుగుపడుతుందనీ, తద్వారా మంచి ఫలితాలు తేవడానికి అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆయా స్థాయిల్లో ఇటీవల 87 కార్యాలయాలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మంత్రులను కలిసినవారిలో పీఆర్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ ఏజీ సంజీవరావు, సీఈ జీ సీతారాములు, ఎస్ఈలు ఎన్ ఆశోక్, సురేశ్చంద్ర రెడ్డి, ఈఈలు బి శ్రీహరి, ముజీబ్, డీఈ పీ చంద్రమౌళి, జేఈ మనీష్ ఇతర అధికారులు ఉన్నారు.