నవతెలంగాణ – హైదరాబాద్: గ్రేటర్లో ట్రాఫిక్ జంక్షన్లు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. విదేశీ తరహాలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పాదచారుల భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనం వేగం తగ్గడం, ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా అం తర్జాతీయ ప్రమాణాలతో జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఆరు జోన్లలో ఒక్కో జోన్కు రెండు చొప్పున ప్రయోగాత్మకంగా రూ.33కోట్లతో పనులు చేపడుతున్నారు. టెండర్ల ప్రక్రియ దాటుకుని పనుల్లో వేగిరం పెంచారు. ప్రస్తుతం 50శాతం మేర పనులు పూర్తికాగా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వచ్చే రెండు నెలల్లోగా అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న జంక్షన్లతో మంచి ఫలితాలు వస్తే భవిష్యత్తులో మరిన్ని ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ధి చేసే విధంగా చర్య లు తీసుకుంటామని అధికారులు తెలిపారు.