నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. కేసు విచారణలో భాగంగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్ వేయడం, అతణ్ని సుదీర్ఘంగా విచారించడం కలకలం రేపుతోంది. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్లో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలపడంతో.. సీబీఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. జేఈ ఇంటికి సీల్ వేయడం సహా దర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలతో.. బాలాసోర్ రైలు ప్రమాదం వెనక కుట్ర ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.