నవతెలంగాణ-ఇల్లంతకుంట : మండలంలోని వల్లంపట్ల గ్రామ శివారులో బుధ ఆర్టీసీ బస్సు బోల్తా పడగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి . సిరిసిల్ల డిపోకు చెందిన బస్ హైదరాబాద్ నుండి వయా ఇల్లంతకుంట మీదుగా సిరిసిల్ల వెళ్తుండగా ట్రాక్టర్ అడ్డు రావడముతో బసు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడటంతో బస్ లో ప్రయాణిస్తున్న వారిలో కొందరికి తీవ్ర గాయాలు కాగా మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి .స్థానిక ఎసై రాజేష్ గాయ పడిన వారందరినీ అంబులెన్సు లో ఆస్పత్రికి తరలించారు.