నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ నుంచి దేహ్రాదూన్ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇంజిన్లో మంటలు చెలరేగాయని వచ్చిన వార్తలను ఇండిగో ఖండించింది. సాంకేతిక లోపం కారణంగానే ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యిందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీనుంచి దేహ్రాదూన్ బయలుదేరిన ఇండిగో విమానం 6ఈ2134, సాంకేతిక కారణంతో బయలుదేరిన చోటుకే తిరిగి వచ్చింది. సమస్యను గుర్తించిన వెంటనే ఈ విషయాన్ని పైలట్ ఏటీసీకి తెలియజేసి అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరారు. దాంతో విమానం దిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.