నవతెలంగాణ – అట్లాంటిక్: మహా సముద్రంలో విచ్ఛిన్నమైన టైటాన్ మినీ జలాంతర్గామిలో ఓషన్గేట్ సంస్థ సీఈవో స్టాక్టన్ రష్తో పాటు మరో నలుగురు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అందులో పాకిస్థానీ బిలియనీర్ హెహ్జాదా దావూద్తో పాటు సులేమాన్ కూడా ఉన్నారు. సులేమాన్కు అసలు ఇటువంటి సాహస యాత్రలంటే భయమట. కేవలం తండ్రి అభీష్టం మేరకే ఈ టైటాన్లో వెళ్లి సముద్రగర్భంలో చనిపోయినట్లు అతడి సమీప బంధువులు వెల్లడించారు. ముఖ్యంగా ‘ఫాదర్స్ డే’ రోజున నాన్నను సంతోషపెట్టాలని భావించి.. చివరకు ప్రాణాలు కోల్పోవడాన్ని నమ్మలేకపోతున్నామని వాపోయారు. పాకిస్థాన్ బిలియనీర్ షెహ్జాదా దావూద్ (48) కుమారుడు సులేమాన్ దావూద్ వయసు కేవలం 19ఏళ్లు. కెనడా నుంచి మొదలయ్యే ఈ ఓషన్గేట్ జలాంతర్గామి ప్రయాణానికి కొన్నిరోజుల ముందు ఈ యాత్రపై సులేమాన్ సంకోచించడంతో పాటు ఎంతో భయపడ్డాడట. ఈ విషయాన్ని షెహ్జాదా దావూద్ సోదరి అజ్మేష్.. అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. ‘టైటానిక్ శిథిలాల సందర్శనకు వెళ్లిన వాళ్లలో సులేమాన్ ఒక్కడే అతి చిన్న వయస్కుడు. మిగతా వాళ్లు వారి ఇష్టం మేరకు వెళ్లినప్పటికీ ఈ యువకుడు మాత్రం అలా జరగలేదు. సముద్రగర్భంలో యాత్ర చేసేందుకు సులేమాన్ సంకోచించాడు. అలా వెళ్లడానికి ఇష్టపడకపోగా.. చాలా భయపడ్డాడు. ఈ యాత్ర ‘ఫాదర్స్ డే’ రోజున జరుగుతున్నందున తన తండ్రిని సంతోషపెట్టాలని అనుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’ అని దావూద్ సోదరి పేర్కొన్నారు. ఆ యాత్ర విషాదాంతమైందని తెలుసుకున్న ఆమె.. సులేమాన్ చనిపోయాడన్న వార్తను నమ్మలేకపోతున్నానని విలపించారు.