నవతెలంగాణ – ముంబాయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 499 పాయింట్లు లాభపడి 63,915కి ఎగబాకింది. నిఫ్టీ 155 పాయింట్లు పుంజుకుని 18,972కి చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో సూచీలు పరుగులు పెడుతున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.