నవతెలంగాణ – వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్న విషయం తెలిసిందే. జిల్లాలో రూ.6100 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఆయన తన టూర్ అప్డేట్స్ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వరంగల్కు బయలుదేరినట్టు వెల్లడించారు. ప్రధాని మోడీ హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగే బహిరంగ సభలోనూ ప్రసంగిస్తారు.