![టీఎస్ఆర్టీసీ మరో శుభవార్త](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/tsrtc-3.jpg)
నవతెలంగాణ హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో శుభవార్త తెలిపింది. కోఠి – కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును ఆర్టీసీ నడపనుంది. 127K నంబర్తో నడిచే ఈ లేడీస్ స్పెషల్ బస్సు.. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్డీకాపుల్, మాసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, గుట్టల బేగంపేట, శిల్పారామం, కొత్తగూడ క్రాస్రోడ్ మీదుగా కొండాపూర్కు వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.