నవతెలంగాణ – హైదరాబాద్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హసన్ నగర్లో ఓ భారీ కొండచిలువ తీవ్ర కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి స్థానికంగా హసన్ నగర్లోని లారీ పార్కింగ్ వద్ద భారీగా శబ్దం రావడంతో లారీ డ్రైవర్లు వెతికారు. అంతలోనే ఓ పెద్ద కొండచిలువలను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సుమారు 20 ఫీట్ల పొడవున్న కొండచిలువ స్థానికంగా కలకలం రేపింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కొండచిలువను పట్టుకొని వెంటనే జూ పార్కు తరలించారు.