నవతెలంగాణ – హైదరాబాద్
వలసదారులతో వెళ్తోన్న మరో పడవ మధ్యధరా సముద్రంలో బోల్తాపడింది. ట్యూనీషియా – ఇటలీ మధ్య సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 37 మంది గల్లంతయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎమ్) తెలిపిన వివరాల ప్రకారం.. ట్యూనీషియా పోర్ట్ ఆఫ్ స్పాక్స్ నుంచి 46 మంది వలసదారులతో పడవ ఇటలీ బయలు దేరింది. ఈ క్రమంలో బలమైన గాలుల కారణంగా వీరు ప్రయాణిస్తున్న బోటు ఇటాలియన్ ద్వీపం లాంపెడుసా వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం 37 మంది గల్లంతయ్యారు. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడిన వారు ఉప-సహారా ఆఫ్రికాకు చెందిన వారు. వీరు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన సమయంలో మరో నౌక ద్వారా ప్రాణాలతో బయటపడినట్లు ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ తెలిపింది.